నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలో శనివారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసి భారతదేశంలో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట స్వరాజ్యాన్ని అనే నినాదంతో 20 సూత్రాలు ప్రవేశపెట్టి పేద ప్రజల కోసం ఇల్లు నిర్మాణం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి పెద్ద పీట వేసిన చరిత్ర ఇందిరా గాంధీని కొనియాడారు. కార్యక్రమంలో అంబాయి ప్రసాద్, నరసింగరావు, రగోతం రెడ్డి, ఇద్రిజ్, చింతకుంట కిషన్, నామాల రాజు, శంకర్, కండక్టర్ నారా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డిలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    