Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన ఇందిరమ్మ లబ్దిదారులు

కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన ఇందిరమ్మ లబ్దిదారులు

- Advertisement -

మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని వేడుకోలు 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం నాడు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల జాబితా పత్రాలను అందజేశారు. నాలుగో తారీఖు బుధవారం అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని మహిళా సంఘాలు, యూత్ సంఘాలు పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రాలు అందజేసి, ఆందోళన కార్యక్రమం నిర్వహించిన విషయం విధితమే. శుక్రవారం అర్హులైన పేద మహిళా సంఘాల నాయకులు, యూత్ సంఘం నాయకులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేయడానికి వెళ్లారు. కానీ కలెక్టర్ అందుబాటులో లేనందున కలెక్టర్ కార్యాలయంలోని ఇంచార్జ్ అధికారికి అర్హులమైన మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామంలో మొత్తం 18 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, వాటిలో ఒక్క నలుగురు మాత్రమే అర్హులుగా ఉన్నారని అన్నారు. మిగతా 14 మంది అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, ఇండ్లు భూములు ఉన్నవారికి ఇచ్చి, మాకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. నిరుపేదలకు న్యాయం చేయాలన వారు మొరపెట్టుకున్నారు. నార్లాపూర్  లో గత ఎన్నో సంవత్సరాల నుండి సొంత ఇల్లు లేక, కిరాయి ఇండ్లలో మగ్గుతూ, కొందరు గుడిసెలు వేసుకొని తీవ్రమైన ఆందోళనలో బ్రతుకుతున్నామని వారు బాధపడ్డారు. కలెక్టర్ గారు స్పందించి మా గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇల్లు లేనటువంటి మా పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి తగు న్యాయం చేయాలని వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -