కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కోడి సతీష్
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం
నవతెలంగాణ – తాడ్వాయి : అర్హులైన ప్రతి ఒక్కరికి మంత్రి సీతక్క సహకారంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కోడి సతీష్ అన్నారు. సోమవారం మండలంలోని కాటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు కోడి సతీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఇతర హామీలను నెరవేరుస్తుందన్నారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దూరి రాములు, నరేష్ హోలీ, సజ్జు, లబ్ధిదారులు, పంచాయతీ కార్యదర్శి భాగ్యరాణి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES