జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం
నవతెలంగాణ – తాడ్వాయి : అర్హులైన ప్రతి ఒక్కరికి మంత్రి సీతక్క సహకారంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి అన్నారు. శుక్రవారం మండలంలోని కామారం (పీటీ) గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళల జాబితాలో మంజూరైన రేగ ధనలక్ష్మి గారి ఇంటి నిర్మాణంలో భూమి పూజ నిర్వహించి, ఇండ్ల నిర్మాణ పనులను స్థానిక ఇన్చార్జి తాసిల్దార్ సురేష్ బాబు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారంటీలను ఇతర హామీలను నెరవేరుస్తుందన్నారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే కామారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఇంచార్జ్ తహశీల్దార్ జె సురేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్రబాబు, మండల మహిళా అధ్యక్షురాలు కోర్నిబెల్లి సావిత్రి, తాడ్వాయి మండలంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ మహిళా నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES