- Advertisement -
నవతెలంగాణ గాంధారి
గాంధారి మండలంలోని గండివెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్ మాట్లాడుతూ గాంధారి మండలంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతాయని ఎవ్వరు కూడా అధైర్య పడద్దని అన్నారు. నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, తదితరలుపాల్గొన్నారు.
- Advertisement -