నవతెలంగాణ – జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశానుసారం మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గు పోసి పనులను ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సొప్పరీ వినోద్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల తరఫున,గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులందరూ తొందరగా పనులు ప్రారంభించి, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు కాటిపల్లి నర్సారెడ్డి, సోప్పరీ వినోద్, వసంతరావు, బుస శ్రీధర్, నట్ట తిరుపతి , పంచాయతీ సెక్రటరీ గంగాధర్ కాంగ్రెస్ నాయకులు మాడవేరి శంకర్ సుధీర్, గన్న లక్ష్మణ్, బొంబాయి రాజు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES