– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రం తో పాటు బషీరాబాద్, చౌట్ పల్లి, అమీర్ నగర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి, ముగ్గులు పోసి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరు సొంతింటిని కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇండ్ల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీల సభ్యులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES