Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.!

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లుగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గురువారం మండలం నాచారం గ్రామంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రవీణ్ రాజ్,ఏఈ రజినీకాంత్,కాంగ్రెస్ పార్టీ నాచారం గ్రామ శాఖ అధ్యక్షులు కన్నూరి రవి, మండల ప్రధాన కార్యదర్శి మావురపు వెంకన్న, సప్పిడి రాజయ్య,సోషల్ మీడియా ఇంచార్జి దొగ్గేల సంపత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -