– రెండు విమానాలు ధ్వంసం చేసిన పాలస్తీనా అనుకూల కార్యకర్తలు
– ఖండించిన బ్రిటన్ ప్రధాని
లండన్ : ఆగేయ లండన్లో బ్రిటన్ అతిపెద్ద వైమానిక స్థావరంలోకి పాలస్తీనా అనుకూల కార్యకర్తలు చొచ్చుకువెళ్ళి విధ్వంసానికి దిగారు. ఆక్స్ఫర్డ్షైర్లోని రాయల్ ఎయిర్ఫోర్స్(ఆర్ఎఎఫ్)కి చెందిన ఎయిర్బేస్లోని రెండు విమానాలను ధ్వంసం చేశారంటూ ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆర్ఎఎఫ్ బ్రిజ్ నోర్టన్లో తమ కార్యకర్తలు పాల్పడిన విధ్వంసాన్ని చూపిస్తూ పాలస్తీనా యాక్షన్ కేంపైన్ గ్రూపు ఒక వీడియో పోస్టు పెట్టింది.
ఆ స్థావరంలో వున్న విమానంపై రెడ్ పెయింట్ను స్ప్రే చేస్తూ, కార్యకర్తలు స్కూటర్లపై ఆ స్థావరమంతా కలియతిరగడం ఆ వీడియోలో కనిపిస్తోంది. గాజాలో జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్ పాత్రను నిరసిస్తూ పాలస్తీనా యాక్షన్ గ్రూపు అనేక నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. రాయల్ ఎయిర్ఫోర్స్ ఆస్తులను ఇలా ధ్వంసం చేయడాన్ని బ్రిటన్ రక్షణమంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపింది. స్థావరాన్ని పగలగొట్టుకుని లోపలకు వెళ్ళడంపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. విదేశాల్లోని ఆపరేషన్లకు మద్దతునిస్తూ, గాల్లో నుండి గాల్లోకి ఇంధనం తిరిగి నింపుకునే కేంద్రం ఇది.
బ్రిటన్ వైమానిక స్థావరంలోకి చొరబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES