- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలని కోరారు. అనంతరం గ్రామంలో ప్రగతిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -