- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానుండటంతో ఎన్నికల అధికారులు కార్యక్రమాలను ముమ్మరం చేసారు. శనివారం మున్సిపల్ కమీషనర్ నాగరాజు వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈవీఎం ల స్ట్రాంగ్ రూం,పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలకు అనువైన గదులను, ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏడీ డాక్టర్ హేమంత కుమార్,శ్రావణ్ కుమార్ లు ఉన్నారు.
- Advertisement -



