నవతెలంగాణ – గోవిందరావుపేట : జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా మంగళవారం గోవిందరావుపేట మండలంలోని పసర చల్వాయి, గ్రామాల్లో విత్తన విక్రయం చేస్తున్నటువంటి షాపులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులు కంపల్సరీ ఆతీకృత డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన పిమట రసీదు తీసుకొని అట్టి రసీదుని పంట కాల మొత్తం కూడా భద్రపరుచుకోవాలని అదేవిధంగా విత్తన విక్రయ షాపు యజమానులు కంపల్సరీ బిల్స్ ఇవ్వాలని ఆ బిల్లుపై ప్లాట్ నెంబర్ మరియు ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసి సంతకం చేసి ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఇట్టి తనిఖీలలో టాస్క్ఫోర్స్ సిఐ రమేష్, గోవిందరావుపేట ఎస్ ఐ కమలాకర్ మరియు మండల వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
ఎరువులు విత్తనాల విక్రయ దుకాణాల తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES