- Advertisement -
నవతెలంగాణ – ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ ను శనివారం వ్యవసాయ అధికారి రచన, ఎస్ఐ బిట్ల పెర్సెస్,ఆర్ఐ నారాయణ పటేల్ లు తనిఖీచేశారు. దుకాణాల్లో స్టాక్ నిల్వ, రికార్డులను,లాట్ నంబర్ లేబుల్, ధరల పట్టిక ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మడం కానీ,లూజు విత్త నాలు, నాణ్యతలేని విత్తనాలను అమ్మి తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల మేరకు నడుచుకోవలన్నారు. కొనుగోలు చేసిన ప్రతిరైతు రశీదు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -