- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవతో, ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షణలో గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగం ఆద్వర్యంలో ఆశ్రమ విద్యార్ధుల్లో వ్యక్తిత్వం వికాసం కొసం నిర్వహిస్తున్న ఇన్స్పైర్, ఇగ్నైట్ రెండో రోజు కొనసాగింది. బుధవారం మండలంలోని కావడి గుండ్ల,అనంతారం బాలికల పాఠశాలల్లో,సున్నం బట్టి,పెద్దవాగు ప్రాజెక్ట్ బాలుర పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ విద్యతో పాటు వినయం,క్రమశిక్షణ తో ఉంటేనే రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ.రాంబాబు,సరోజిని,సుశీల,హెచ్.రాంబాబు లు పాల్గొన్నారు
- Advertisement -