Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.కోటి బీమా సదుపాయం కల్పించాలి

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.కోటి బీమా సదుపాయం కల్పించాలి

- Advertisement -

– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కేజీబీవీ టీచర్లతో పాటు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.కోటి బీమా సదుపాయం కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి బీమా కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారే తప్ప విధి విధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కష్టపడుతున్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేదనీ, సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదనీ, విధి వక్రించి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలకు కనీస భద్రత లేదని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ టీచర్‌తో పాటు కేజీబీవీ ఎస్‌ఓ కు రూ.కోటి బీమా అందజేయాలనీ, ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ప్రకటన చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కల్పన, గీతారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మిగతా ఇద్దరు టీచర్లు కోలుకొని క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -