ముమ్మరంగా వాహనాల తనిఖీలు

నవతెలంగాణ – గాంధారి 

గాంధారి మండల కేంద్రంలో పరిసర ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికల దృశ్య పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ముఖ్య అనుచరులపై పోలీసులు ప్రత్యేక నిగా పెట్టారు వారి వాహనాల పై  ప్రత్యేక నిఘా ఉంచారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 15 రోజులు ఉన్నా ఇప్పటి నుంచే పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు మద్యం సరఫరాను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషనర్ ఆదేశానుసారం తనిఖీలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బి బి బాటిల్ అనుచరుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు తానాజీ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
Spread the love