- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్న జంటపై బంధువులు దాడి చేశారు. ఈ ఘటన వరంగల్(D) నల్లబెల్లి పీఎస్ ఎదుట చోటుచేసుకుంది. వేర్వేరు కులాలకు చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం పీఎస్ను ఆశ్రయించారు. మాట్లాడేందుకు ఇరు కుటుంబాల పెద్దలను పోలీసులు స్టేషన్ కు పిలవగా, జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులు కలగజేసుకుని వారిని చెదరగొట్టారు.
- Advertisement -