Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచెట్టుకు ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 

చెట్టుకు ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని వేల్పూర్ సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన ఒక విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ బైపీసీ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం వ్యాయామం పూర్తి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ కళాశాల వెనుక గల నర్సరీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నాడు. విద్యార్థి సంఘ నాయకులు అధ్యాపకులను సంప్రదిస్తే తమ విద్యార్థి కాదని బుఖాయించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -