Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం..

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్లో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ తోటకూర యాదయ్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి పిలుపుమేరకు  యోగ టీచర్ భవాని పర్యవేక్షణలో యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. యోగ అనేది శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో గానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు ఒత్తిడి తట్టుకోవడానికి, మానసిక ధైర్యానికి  ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపింబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కౌసల్య, ఉపాధ్యాయులు భవ్య, సురేందర్, పింకీదేవి, రవీందర్, నవరతన్, రషీదా బేగంతో పాటుగా అధ్యాపకులు,  విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -