నవతెలంగాణ – భిక్కనూర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్, చైతన్య విద్యానికేతన్, విజ్ఞాన్ హై స్కూల్, నలంద విద్యాలయం పాఠశాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, పట్టణ ప్రజా ప్రతినిధులు యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులతో భిక్నూర్ కు చెందిన యోగ గురువు బల్యాల నర్సింలు, పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ మాట్లాడుతూ యోగా ఒక సమగ్ర అభ్యాసం అన్ని మానసిక ప్రశాంతతను, చదువుపై ఏకాగ్రతను పొందడానికి ఉత్తమ మార్గం అన్నారు. యోగా సాధన భారతదేశంలో ఉద్భవించిన ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితిలో అంగీకరించబడిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ గురువు నర్సింలును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, మెడికల్ అధికారి యేమిమా, దివ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES