Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చిలో విద్యుత్‌ సంస్థల కార్యాలయాల్లో విచారణ

మార్చిలో విద్యుత్‌ సంస్థల కార్యాలయాల్లో విచారణ

- Advertisement -

బీసీ కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మార్చి నెల నాలుగో వారంలో విద్యుత్‌ సంస్థల కార్యాలయాలను సందర్శించి విచారణ నిర్వహించాలని బీసీ కమిషన్‌ నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని బీసీ కమిషన్‌ కార్యాలయంలో ఆ కమిషన్‌ చైర్మెన్‌ జి. నిరంజన్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ సంస్థల నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘం కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మి, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ బాల మాయదేవి, డిప్యూటి డైరెక్టర్‌ యు.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్‌ రావు, సెక్షన్‌ ఆఫీసర్‌ జి.సతీష్‌ కుమార్‌ హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -