వానాకాలం సాగుకు సమాయత్తం
మండలంలో 6,924 వేల మంది రైతులకు లబ్ధి
రూ.5.88 కోట్లు ఖాతాల్లో జమ
నవతెలంగాణ – మల్హర్ రావు: వానాకాలం సాగులోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎకరాల ప్రస్థావన లేకుండా అర్హులైన లబ్ధిదారులకు 9 రోజుల్లోనే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించింది. మండల వ్యాప్తంగా 6,924 మంది రైతులకు రూ.5,88,25,780 కోట్లు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 6 వేల చొప్పున రబీ, ఖరీఫ్ కు పెట్టుబడి సాయం అందిస్తోంది. కాగా గత యాసంగిలో కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అందించింది. అవి కూడా సకాలంలో అందకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రయివేట్ వ్యక్తులను ఆశ్రయించారు.
అయితే ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఎకరాలతో సంబంధం లేకుండా జమచేసింది. అవి కూడా సీజన్ ప్రారంభంలోనే అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 ఎకరాలకు వరకు అందినట్లుగా తెలుస్తోంది. త్వరలో మరో 50 మంది రైతులకు సంబంధించి 200 ఎకరాలకు రైతు భరోసా పడనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అకౌంట్లు మారటంతో పాటు ఆధార్ కార్డు పేర్లు తప్పులు దొర్లటం లాంటి సమస్యలతో పెట్టుబడి సాయం జమ కాలేదు. వీటిని సరిచేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వీరికి సైతం వానాకాలం సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అదునుకు ఆదుకున్న పెట్టుబడి సాయం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES