Sunday, February 8, 2026
E-PAPER
Homeబీజినెస్బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి

బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి

- Advertisement -

– ది వెల్త్‌ కంపెనీ సీఈఓ మధు లునావత్‌
హైదరాబాద్‌ :
ప్రస్తుత మార్కెట్‌ ఒడిదుడుకులు, మారుతున్న అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యం లో పెట్టుబడిదారులు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ (బీఎఎఫ్‌) వైపు ఆసక్తి చూపుతు న్నారని నిపుణులు అంచనా వేస్తోన్నారు.. మార్కెట్‌ విలువల, రిస్క్‌ సూచికల ఆధారంగా ఈక్విటీ, డెట్‌ మధ్య పెటు ్టబడులను డైనమిక్‌గా మార్చుకునే ఈ ఫండ్స్‌, రిస్క్‌ను తగ్గిస్తూనే వృద్ధిని అంది స్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని ది వెల్త్‌ కంపెనీ వ్యవస్థాపకు రాలు, సీఈఓ మధు లునావత్‌ పేర్కొ న్నారు. ఎఎంఎఫ్‌ఐ గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఈ విభాగంలో నెలకు సగటున రూ.1,377 కోట్ల పెట్టుబడులు రాగా, జులై-ఆగస్టు నెలల్లో ఇవి రూ.2,000 కోట్లు దాటడం గమనార్హం. ప్రస్తుత అనిశ్చితిలో పెట్టుబడిదారులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఈ ఫండ్స్‌ క్రమబ ద్ధమైన ఆస్తి కేటాయింపును అందిస్తాయని మధు లునావత్‌ తెలిపారు. ప్రస్తుతం అందు బాటులో ఉన్న ‘ది వెల్త్‌ కంపెనీ బ్యాలెన్స్‌ డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌’ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఫిబ్రవరి 10తో ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -