- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ఈనెల 30 న జియా గూడ రంగనాథస్వామి ఆలయంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు రావాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ ప్రతినిధులు ఆహ్వానం పలికారు. కార్పొరేటర్లు బి దర్శన్, శంకర్ యాదవ్, బద్రి నాథాచార్యులు ల బృందం తలసాని కి ఆహ్వాన పత్రం అందజేశారు. శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శనం కోసం తాను తప్పనిసరిగా హాజరవుతానని ఆయన తెలిపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కృష్ణ, సందీప్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



