- Advertisement -
పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు
మనామా : బహ్రెయిన్లో ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. ఈ దాడి కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, రిఫైనరీ పనిచేస్తూనే ఉన్నదని బహ్ రైన్ తెలిపింది. గల్ఫ్ అరబ్ దేశాలకు ఆయువు పట్టు అయిన చమురు పరిశ్రమపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా మధ్య ప్రాచ్యంలోనూ, ఇతర ప్రాంతాలలోనూ 14 దేశాలపై ప్రభావం పడుతోంది.
- Advertisement -



