- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ కోసం ఇరాన్ గగనతలాన్ని తెరచింది. దీంతో 1000 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టిన సంగతి తెలిసిందే. డ్రోన్ దాడుల కారణంగా ఇరాన్ గగనతలం అంతర్జాతీయ విమానాలకు మూసివేయబడింది. కాగా ఇండియా విజ్ఞప్తి మేరకు ఇరాన్ గగనతలాన్ని తెరిచింది.
- Advertisement -