అప్పుడు..ఇప్పుడు…ఇక ముందు కూడా అన్నదాతలకు బేడీలు తప్పవా? అరకలు కట్టి, విత్తనం వేసి, కలుపు తీసి, పంట కోసి, మర పట్టించి కడుపు నింపే చేతులకు బేడీలు వేసి రోడ్డుమీద ఊరేగించడం న్యాయమా? వారు చేసిన తప్పేంటి? పంటలకు నష్టం చేసే ఫ్యాక్టరీ తమ ప్రాంతంలో వద్దని నిరసనకు దిగినందుకు. నాడు పోడు రైతు లను బీఆర్ఎస్ ప్రభుత్వం బేడీలతో పోటు పొడిచింది. నేడు పరిహారం అడిగినందుకు కాంగ్రెస్ సర్కార్ సంకెళ్లు వేసింది. ఎన్ని అవమానాలు జరుగుతున్నా…దౌర్జన్యాలు కొనసాగుతున్నా… రైతు మాత్రం పట్టువదలని విక్రమార్కు డిలా పంట దున్నుతూనే ఉన్నాడు. దేశానికి ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాడు. ప్రకృతిపై భారం మోపి, చెమటను ధారపోసి పంట పండిస్తూనే ఉన్నాడు. ఇంతచేసినా పాలకుల నుంచి ఏదైనా సహకారం ఉంటుందా? అంటే అదేమీ ఉండ దు. వారిదంతా కార్పొరేట్ పాలనా యే! కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా రైతుల పొట్టకొ డుతూ పెట్టుబడిదారుల పొట్టలు నింపడమే పనాయే. అదానీ, అంబానీలాంటి కంపెనీల్లో తయారు చేసిన ఉత్పత్తులన్నింటికి వారు చెప్పిన రేటుకే ప్రజలంతా కొనాల్సి వస్తోంది. పైగా సర్కారేమో వారికి రాయితీలు కూడా ఇస్తోంది. రైతులు పండించిన పంటకు మాత్రం మద్దతు ధర కల్పించదాయే. పోనీ మార్కెట్కు తీసుకెళ్తే దళారులు, అధికారులు చెప్పి నట్టు వినాల్సి రావట్టే. పంట పండించడం తప్ప మోసం ఎరుగని రైతులను పాలకులు, అధికారులు, ఏజెంట్లు అంతా కలిసి ఏదో రకంగా దగా చేయనేబట్టే. ఇది తెలిసినా కూడా ఏమీ చేయని అమాయక రైతుల చేతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టే పాలకులను ఎలా చూడాలి? ఇది ప్రజలే ఆలోచించాలి.
-గుడిగ రఘు
బేడీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES