జైల్లో మృతి చెందినట్టు వార్తలతో కలకలం
చూపించాలంటూ మద్దతుదారుల ఆందోళనలు
ఆయన్ను కలవడానికి వచ్చిన కుటుంబసభ్యులపై ఖాకీ జులుం
ఇస్లామాబాద్ : జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ని కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనంతటికీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారనే వార్తలు బయటకు రావడమే కారణమని తెలుస్తోంది. కాగా, 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలులో ఉన్నారు. అయితే, ఆయన్ను హతమార్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. దీనికి సంబంధించిన వార్తను బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతా లో పోస్ట్ చేసింది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ను హతమార్చినట్టు వార్తలు వస్తున్నా యని అందులో రాసుకొచ్చింది. ఇంకా పలు మీడి యా సంస్థలు కూడా దీనికి సంబంధించి వార్తలను ప్రచురించినట్టు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ చేశారు. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు కూడా వినిపిస్తు న్నాయి. కానీ, ఇప్పటి వరకు వీటిని ధ్రువీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారమూ బయటకు రాలేదు. ఈ వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు మంగళ వారం రాత్రి జైలు వద్దకు చేరుకోగా..తమ సోదరుణ్ని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అందుకు అనుమతించలేదని, పైగా వారిపై తీవ్రంగా దాడి కూడా చేసినట్టు తెలు స్తోంది. దీంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నట్టు సమాచారం.
ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


