Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయితీ విత్తనాలు లేనట్లేనా.?

రాయితీ విత్తనాలు లేనట్లేనా.?

- Advertisement -

పెట్టుబడి సాకుతో రాయితీ విత్తనాలకు ప్రభుత్వం మంగళం..
గతంలో విత్తనాలు రాయితీపై సహకార సంఘాల ద్వారా విక్రయం
నవతెలంగాణ – మల్హర్ రావు
: రాయితీ విత్తనాల సరఫరా నిలిచిపోవడంతో రైతులపై విత్తన కొనుగోలు భారం ఏర్పడుతోంది. గతంలో ప్రతి వర్షాకాలం సీజనులో మొక్కజొన్న,సోయా,కూరగాయల విత్తనాలు రాయితీపై అందించే వారు. సహకార సంఘాల ద్వారా రాయితీ విత్తనాల వ్యాపారం చేయడం వల్ల సంఘాలకు ఆదాయం కలిసివచ్చేది. ప్రభుత్వం ద్వారా విత్తనాల పంపిణీ సాగడం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేవి. 35 శాతం వరకూ రాయితీ లభించడంతో రైతు లు విత్తనాల కొనుగోలుకు తక్కువనే ఖర్చు చేసేవారు. ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించే కంపెనీల విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొనుగోలు చేయించేది. విత్తనాల కొనుగోలు కోసం రైతులు తక్కువ ఖర్చు చేయడంతో పాటు ఎంతో మేలు రకమైన విత్తనాలను తీసుకుని పంటలను సాగు చేసేవారు. 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడం మొదలు పెట్టిన నుంచి రాయితీ విత్తనాల సరఫరాకు బ్రేక్ పడింది. పెట్టుబడి సాయం కూడా సీజను ఆరంభమైన సమయంలో కాకుండా తమకు వీలును బట్టి ప్రభుత్వం అందించడం వల్ల ఆ సొమ్ము సరైన పనులకు ఉపయోగపడటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాయితీ విత్తనాలు సీజను ఆరంభంలోనే అందించేవారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రాయితీ విత్తనాల సరఫరాపై దృష్టి సారించకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం పునరాలోచన చేసి రాయితీ విత్తనాల సరఫరాను పునఃప్రారంభిం చాలని రైతులు కోరుతున్నారు.

వ్యాపారుల వద్ద కొనాల్సి వస్తోంది: దేవదానం, రైతు.. తాడిచెర్ల

రాయితీపై రైతులకు ఎంతో మేలు రకమైన విత్తనాలు అందేవి. ఇప్పుడు రాయితీ ఎత్తివేయడంతో వ్యాపారుల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. పెట్టుబడి సాయం ఇస్తున్నామనే సాకుతో రాయితీ విత్తనాలను అందించకపోవడం సరైంది కాదు. ప్రభుత్వం స్పందించి రాయితీ విత్తనాలను సరఫరా చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -