జిల్లా కమిటీ సభ్యుడు రాజు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : 21 శతాబ్దంలో విద్య యొక్క ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుంది. నేటి పౌర సమాజంలో చదువుకున్న వ్యక్తిని ప్రథమ శ్రేణి పౌరులుగా పరిగణించడాన్ని మనం గమనిస్తున్నాం. నాణ్యమైన విద్యను సమాజానికి అందించగలిగితే పౌరుల యొక్క నైతిక ,వ్యక్తిగత ,అభివృద్ధి తో నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేయవచ్చు. సామాజిక అంశంతో ముడిపడి ఉన్నా, విద్యను పేద వర్గాలకు అందించడానికి ప్రభుత్వాలు ప్రణాళిక బద్ధమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య దొరకదు అనే భావన తెలంగాణలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మనసులో బలంగా నాటుకుంది. గనుక ప్రభుత్వాలే ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ సమాజాన్ని గమనించినట్లయితే 80 శాతం మంది విద్యార్థులు వెనుకబడిన వర్గాలే కాబట్టి విద్య కోసం అత్యధికంగా డబ్బులను ఖర్చు చేసే స్తోమత తల్లిదండ్రులకు లేదు. విద్య మీద నియమించిన కమిషన్లు కూడా తల్లిదండ్రులు వారి పిల్లల మీద విద్యకు ఖర్చు చేసిన ఖర్చు వల్ల 80% అప్పుల పాలవుతున్నారని, ఈ కమిషన్లు స్పష్టం చేశాయి. ఇటీవల కాలంలో 2025- 2026 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను 210 పాఠశాలల్లో అందిస్తాం అని ఓ ప్రకటన చేసింది. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే లాన్ సెట్ నివేదిక 2017 ప్రకారం ఆరు సంవత్సరాల పిల్లల్లో 80 శాతం మెదడు మీద అభివృద్ధి చెందుతుందని, దాని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ప్రీస్కూల్ వాతావరణాన్ని ప్రభుత్వ పాఠశాలలు అందించినట్లయితే పిల్లలు ఆడుతూ పాడుతూ తమ యొక్క పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుంటారు. దీని ద్వారా స్కూలు అంటే భయం అనే వాతావరణం తొలగి, స్కూల్ మీద ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో విద్యార్థుల నమోదు శాతంకూడా పెరుగుతుంది. ప్రభుత్వం ప్రారంభించిన పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అమలు చేయడానికి తల్లిదండ్రులతో స్కూళ్లలో విద్యా కమిటీలు ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తిని పర్యవేక్షణ చేయాలి. దీని ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను చక్కగా అమలు జరపవచ్చు.