జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి
నవతెలంగాణ – నెనెల్లికుదురు
సంస్కృతిక కళా ఉత్సవ పోటీలో ద్వితీయ బహుమతి ఈసంపల్లి పవన్ దక్కించుకున్నాడని జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి అన్నారు. సోమవారం షీల్డ్ మెమొంటో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లామాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల కళా సృజనాత్మక కళా నైపుణ్యాన్ని పల్లెల్లో పట్టణాల్లో గత అనేక సంవత్సరాలుగా పల్లెల్లో ప్రజలు వివిధ రకాల కలలను నిర్వహించుకుంటారు .
దానిలో భాగంగా విద్యతోపాటు కళా నైపుణ్యం కూడా విద్యార్థులకు అవసరమేనని జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి గారు అన్నారు. కలలు పల్లెలకు పుట్టినిల్లుగా ఆదర్శంగా నిలుస్తుంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఇసం పెల్లి పవన్ నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన వారు ప్రస్తుతం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తన డప్పు వాయిద్యం ద్వారా జిల్లాస్థాయిలో రెండవ బహుమతి అందుకోవడం జరిగింది. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు అభినందించారు.
సాంస్కృతిక కళా ఉత్సవ్ పోటీలో ద్వితీయ బహుమతి పొందిన ఇసంపెల్లి పవన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES