Thursday, June 19, 2025
E-PAPER
Homeజాతీయంనా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనేది వాస్తవం : వైఎస్‌ షర్మిల

నా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనేది వాస్తవం : వైఎస్‌ షర్మిల

- Advertisement -

అమరావతి : ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనేది వాస్తవమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. నా ఫోన్‌, నా భర్త ఫోన్‌, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్‌ చేశారని తెలిపారు. ఫోన్‌ ట్యాప్‌ జరిగినట్టు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్‌ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని అన్నారు. ఏపీలోని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన షర్మిల ఈ విధంగా వివరాలు వెల్లడించారు.
బైబిల్‌పై ప్రమాణం చేసి చెబుతున్నా ఫోన్‌ ట్యాపింగ్‌ పచ్చి నిజం అని వైఎస్‌ షర్మిల వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఆనాడు జగన్‌, కేసీఆర్‌ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే ఇద్దరి స్కెచ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ అని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -