Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత

కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత

- Advertisement -

– రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – రాయపర్తి : బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత అని రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొలను పెల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు తోట నర్సింగం, పిఎసిఎస్ డైరెక్టర్ తోట యోగానందం తల్లి రాధమ్మ, కొండూరు గ్రామానికి చెందిన రామరాపు సామేలు, రామరాపు రాములు, తిర్మలయపల్లి గ్రామానికి చెందిన వంగల మణెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యకర్తల కుటుంబాలు కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరం అన్నారు. ప్రతి కుటుంబానికి పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటా అని హామీ ఇచ్చారు. తదుపరి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన ల్యాడళ్ల ప్రశాంత్ ను పరామర్శించారు. ఆయనతోపాటు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, ఐత రాంచందర్, యాదవ రెడ్డి, పంతంగి నర్సయ్య, చందు రాము, సంకినేని ఎల్లస్వామి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -