Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువర్షాలు పడుతున్నాయి.. అటవీ భూమి కబ్జా కాకుండా చూడాలి: రేంజ్ అధికారి

వర్షాలు పడుతున్నాయి.. అటవీ భూమి కబ్జా కాకుండా చూడాలి: రేంజ్ అధికారి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
గత కొన్ని రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కొందరు అటవీ భూములను కాబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తారని, అటవీ భూములు కాబ్జా కాకుండా  చూడాలని ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్  అధికారి రవి మోహన్ భట్ పేర్కొన్నారు. మంగళవారం అటవీ రేంజ్ కార్యాలయంలో రేంజ్ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సెక్షన్, బీట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రేంజ్ అధికారి రవి మోహన్ భట్ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో అటవీ భూములను కబ్జా కాకుండా ప్రతి నిత్యం పర్యవేక్షించే విధంగా చూడాలని సూచించారు. ఎక్కడైనా ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేసి చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక, మొరం తరలిస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులను, పక్షులను వేటాడటం నేరమని, ప్రజలు ఆటవీ శాఖ అధికారులకు సహాయ సహకారాలు అందజేస్తూ అటవీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ రేంజ్ అధికారి తూకరం రాథోడ్, సెక్షన్ అధికారులు అతిఖ్ అహ్మద్, బగిలి శ్రీకాంత్, భాస్కర్ ,రేంజ్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad