నవతెలంగాణ -ముధోల్
ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ఉత్తమ డాక్టర్ అవార్డుకు ఎంపిక య్యరు. వైద్యరంగంలో విశిష్టమైన సేవలు అందించినందుకు ప్రైవేట్ టీవీ చానెల్ వారు అవార్డుకు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను ఎంపిక చేశారు. దీంతో హైదరాబాదులో ఆదివారం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ కు ఘనంగా సన్మానించి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న రు. ఈసందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది , జి డి ఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బైంసా వైద్యులు డాక్టర్ ఏ దామోదర్ రెడ్డి, డాక్టర్ దీప జాదవ్, డాక్టర్ సుమల రెడ్డి, డాక్టర్ ప్రీతం ,డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ సూర్యకాంత్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ రచన, సిబ్బంది, బైంసా ఆరె మరాఠా సంఘం గౌరవ అధ్యక్షులు, జాధవ్ పుండలిక్ రావు పాటిల్, అధ్యక్షులు రఘువీర్ పాటిల్, సభ్యులు అభినందించారు.
ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్న జాదవ్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES