- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం కాలుకు గాయమై హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స చేసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని శనివారం వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకంట్ల జగదీశ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మంత్రి తో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -