- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వట్టే జానయ్య యాదవ్ ను ఆదివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యాదమల్లయ్య యాదవ్ తెలిపారు. ఈకార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, డిసిసిబి డైరెక్టర్ సూర్యనారాయణ యాదవ్, రాసాల దత్తు సత్తి యాదవ్, జిల్లా నాయకులు పర్వత మహేష్, కల్లూరి మచ్చ గిరి యాదవ్, బొంగు పుల్లయ్య యాదవ్ లు పాల్గొన్నారు.
- Advertisement -