నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆచార్య (ప్రొఫెసర్) జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం” అను కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంఛనంగా భువనగిరి కలెక్టరేట్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి , భాస్కర రావు పాల్గొన్నారు. “ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం” కార్యక్రమంలో భాగంగా భువనగిరి, ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూరు, మోత్కూరు , ఆత్మకూర్ మండలాల్లోని ఇద్దరేసి రైతులకు 10 కిలోల వరి విత్తన కిట్ లఘదా 3 కిలోల పెసర విత్తన కిట్లను అందజేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో “ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం” అనే కార్యక్రమాన్ని ఆయా జిల్లా మంత్రుల లేదా శాసనసభ్యుల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభం జరిగిందని ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా 11,000 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు రైతులకు 33,000 విత్తన కిట్ లను ను పంచడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. రైతులకు పంపకానికి 10 కిలోల KNM-1638 విత్తనపు వడ్లు ,మూడు కిలోల MGG-385 పెసర విత్తనం,నాలుగు కిలోల మొక్కజొన్న, మూడు కిలోల జొన్న విత్తనాన్ని అందుబాటులో ఉంచారు. రైతులకు ఏదైనా ఒక విత్తనపు కీట్ ను చొప్పున ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3న అన్ని జిల్లాల మండల కేంద్రాల్లో విత్తన కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతులకు ఇవ్వనున్నారు. అనంతరం 11:30 గంటలకు మాసుకుంట రైతు వేదికలో భువనగిరి,వలిగొండ, పోచంపల్లి , బీబీనగర్ మండల రైతులకు వరి , పెసర విత్తనపు కిట్లను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. తదనంతరం వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.హెచ్ దామోదర్ రాజు మరియు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్ వరి రకాలను, సాగు మెలకువలను తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సి.హెచ్ దామోదర్ రాజు, డాక్టర్ బి.అనిల్ కుమార్, డాక్టర్ నీలారాణి, డాక్టర్ విజయ కుమారి, డాక్టర్ రామ్ గోపాల్ వర్మ, డాక్టర్ స్వరూప రాణి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ కవిత మొదలగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ భువనగిరి జిల్లా అధికారులు- జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, వ్యవసాయ సహ సంచాలకులు వెంకటేశ్వరరావు మరియు నీలిమ, వివిధ మండల వ్యవసాయ అధికారులు మల్లేష్, కీర్తి, పావని, రాజేష్, శ్రీనివాస్, శైలజ, దీప్తి, ప్రశాంతి, అంజనీదేవి, వివిధ క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనాల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES