మున్సిపల్ కమిషనర్ సుష్మ..
నవతెలంగాణ – పరకాల
తెలంగాణ సిద్ధాంతకర్త స్పూర్తి ప్రధాత ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ జయంతి వేడుకలను పరకాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సుష్మ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్నారు.
తడి పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమాలు..
పరకాల పురపాలక సంఘం లో నిరంతరం పారిశుద్ధ నిర్వహణలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డులలో మహిళలకు తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి కమిషనర్ వివరించడం జరిగింది. విలీన గ్రామాలైన రాజుపేట, సీతారాంపురం గ్రామాలలో దోమల నివారణ కొరకు దోమల మందు పిచికారి చేయడం అలాగే పాగింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో కమిషనర్ తో పాటు సానిటరీ జవాన్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.