- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండల కేంద్రంలోని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహా వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆర్ఐ సాహితీ తహసిల్దార్ సిబ్బంది ఎంపీడీవో సిబ్బంది పాల్గొన్నారు
- Advertisement -