నవతెలంగాణ – మల్హర్ రావు : ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని బీసీ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాకవత్ సవేందర్ మాట్లాడారు. స్వరాష్ట సాధన కోసం మలిదశ పోరాటం చేసిన గొప్ప ఉద్యమ కారుడు జయశంకర్ ని కొనియాడారు.అన్ని వర్గాలు ప్రజలు,యువత ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. త్వరలో కొయ్యుర్ లో తెలంగాణ ఉద్యమకారుల,ప్రజాసంఘాల, మేధావుల ప్రొఫెసర్లు, ప్రజా ప్రతినిధుల,కుల సంఘాల సహకారంతో జయశంకర్ విగ్రహం పెడతామన్నారు.ఈ కార్యక్రమంలో తాజోద్దీన్, కలిముద్దీన్,బోయిని రాజయ్య యాదవ్,గడ్డం ప్రేమ్, రవీందర్, పోచయ్య, బాలయ్య, మహేందర్, పోచయ్య, శ్రీను, లక్ష్మణ్, కమలుద్దీన్, పెంటయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.
ఘనంగా జయశంకర్ వర్థంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES