- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావు పేట : మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ వర్ధంతి ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా, ఎటువంటి ప్రతి ఫలం ఆశించకుండా రాష్ట్ర సాదనే ద్యేయం గా ఆయన జీవితం సాగిందని ఫోరమ్ కోశాధికారి దర్శనాల సంజీవ అన్నారు. ఈ కార్యక్రమం లో మహిళా అధ్యక్షులు బత్తుల రాణి తో పాటు లకావత్ నరసింహ నాయక్, రేండ్ల సంతోష్, పెండెం హేమాద్రి, దేవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బైకాని ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -