- Advertisement -
హైదరాబాద్ : ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా హైదరాబా ద్లో 17వ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ను ఏర్పాటు చేసింది. హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు. దక్షిణాదిలో ముఖ్యమైన బీ2బీ ఆభరణాల వాణిజ్య వేదికగా దీన్ని ఏర్పాటు చేసింది. దేశ విదేశాల నుంచి వేలాది మంది ఆభరణాల వ్యాపారులు, డిజైనర్లు, తయారీదారులు, రిటైలర్లు ఇక్కడ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. దీనికి 8 వేల మందికి పైగా వ్యాపారులు వస్తారని ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్, సీనియర్ గ్రూప్ డైరెక్టర్ పల్లవి మెహ్రా, డైరెక్టర్ పంకజ్ షెండే తెలిపారు.
- Advertisement -