నవతెలంగాణ – కంఠేశ్వర్ : హైదరాబాద్ లో జరిగిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 320డి ప్రిలిమినరీ క్యాబినెట్ సమావేశంలో 2025- 26 గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు 2025- 26 సంవత్సరానికి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాల జిల్లా చైర్మన్ గా జిల్కార్ విజయానంద్ ను ఆదివారంం నియమించారు. ప్రస్తుతం జోన్ చైర్మన్ గా లయన్స్ క్లబ్ ఇందూర్ కు పూర్వాద్యక్షులుగా విజయానంద్ వ్యవహరించారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్దాలను వివరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహింపజేయాలని ఈ సందర్భంగా అమర్నాథ్ రావు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ చైర్మెన్ విజయానంద్ కు సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైస్ గవర్నర్ నరసింహరాజు, జిల్లా కోశాధికారి మర్రి ప్రవీణ్, జిల్లా కేబినెట్ అధికారులు డికొండ యాదగిరి, లక్ష్మీనారాయణ, కరిపే రవీందర్, రమేష్ కులకర్ణి పాల్గొన్నారు.
లయన్స్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ చైర్మన్ గా జిల్కార్ విజయానంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES