– కొమ్రంభీం టైగర్ రిజర్వు రద్దు చేయాలనే డిమాండ్ను సీఎం దృష్టికి తీసుకెళ్తా
– జీవో నెంబర్ 3 పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం
– ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో మంత్రి డాక్టర్ సీతక్క
– జీవో 49ని రద్దు చేయాలని సమావేశం తీర్మానం
– గ్రామసభల అనుమతి లేకుండా అటవీ అధికారులను రానివ్వొద్దని విన్నపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొమ్రం భీం కన్జర్వేషన్ టైగర్ రిజర్వు రద్దు చేయాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు చేసిన విన్నపాన్ని సీఎం, క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) హామీనిచ్చారు. త్వరలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక జాబ్మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. మంగళవారం మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్లో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రాంచంద్రు నాయక్ను మంత్రి సీతక్క, ఎస్టీ ఎమ్మెల్యేలు సత్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మీ, అనిల్ జాదవ్, ఆదినారాయణ, ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మెన్ కోట్నాక్ తిరుపతి, ట్రైబల్ కార్యదర్శి శరత్, ఎస్టీ గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మీ, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ. 1,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం, రూ. 12,600 కోట్లతో ఇందిర సౌరజల గిరి వికాసం, రూ.17,168 కోట్లతో ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో గిరిజనుల విద్య, ఆరోగ్యం, వసతి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజా ప్రయోజన పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమ్రంభీం కన్జర్వేషన్ టైగర్ రిజర్వుగా ప్రకటిస్తూ తెచ్చిన జీవో నెం.49ను ఉపసంహరించుకో వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రామసభ అనుమతి లేకుండా గిరిజన గ్రామల్లో, పొలాల్లో అటవీశాఖ అధికారులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి సీతక్క దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. పెసా చట్టాలను ఉల్లంఘి స్తూ అటవీ అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నార ని అసంతృప్తి వ్యక్తం చేశారు. భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే దక్కేలాగా జీవో నెం.3ను పునరుద్ధరించాలన్న ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇందిరా సౌరజల, గిరివికాసం ద్వారా గిరిజన రైతుల భూముల్లో సిరులు పండించబోతున్నామన్నారు. ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.12 కోట్లు కేటాయించామని చెప్పారు. గిరిజన శాఖలోని పెండింగ్ బిల్లులను విడుదల చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన విద్యా సంస్థల్లో జాతి గొప్పతనాన్ని చాటేలా అట పాటల ద్వారా ఆదివాసీగిరిజన సంస్కృతిని చాటి చెప్పేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రాచలంలో మాదిరి గానే మిగతా ఐటీడీఏల పరిధిలోనూ మ్యూజియాలు, లైబ్రరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏజెన్సీల్లో ప్రత్యేక జాబ్ మేళాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తామనీ, త్వరలో మహబూబాబాద్, అసిఫాబాద్లో ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖలో అంతర్ భాగంగా ఉన్న సాంస్కృతిక విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని భరోసానిచ్చారు. ఐటీడీఏ పరిధిలోని 26 శాఖలను తిరిగి ఐటీడీఏ గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్లో గిరిజన విద్యా సంస్థల్లో చదుకున్న విద్యార్థులకు 40 నుంచి 50 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
గిరిజన ఆహారశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
సంక్షేమభవన్ ప్రాంగణంలో గిరిజన ఆహారశాలను, దేవాలయాలను మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. అటవీ ఉత్పత్తులతో తయారు చేసిన 20 రకాల వంటకాలు, చిరుతిళ్ల స్టాళ్లను సందర్శించారు. గిరిజన ఆహారం పేరుతో స్టాల్ కూర్చొని తినేందుకు గుడిసె థీమ్ తో చెక్క టేబుల్ను ఆసక్తిగా పరిశీలించారు. పలు వంటకాల రుచి చూశారు. గిరిజన దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో కొమ్రంభీం డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి వీక్షించారు.
త్వరలో ఏజెన్సీల్లో జాబ్మేళాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES