నవతెలంగాణ – నెల్లికుదురు : ప్రజా సమస్యల కోసం పోరాడే తన కుమారుడు సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వెల్తురు యాకయ్యకు వెన్నంటే ఉంటూ ధైర్యసహసాలు అందించిన మహోన్నత వ్యక్తి వెల్తూరి ముత్తయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వెల్తూరి ముత్తయ్య(95) అనారోగ్యానికి గురై మృతి చెందారు. ముత్తయ్య పార్థివదేహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పాడే మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. తన కుమారుడు వెల్తూరి యాకయ్యను ప్రజాసేవ కోసమే సీపీఐ(ఎం)కు అంకితం ఇచ్చానని చెబుతూ ఉండేవారని ఆయన గుర్తు చేశారు. ముత్తయ్య అంత్యక్రియల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు బొజ్జ బిక్షమయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భూపాల్, జగదీష్, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పాపారావు, బొల్లం అశోక్, దుడ్డేల రామ్మూర్తి, నెల్లికుదురు కేసముద్రం మండల కార్య దర్సులు ఇసంపెల్లి సైదులు, గొడిశాల వెంకన్న, నాయకులు బాబు గౌడ్, జయరాజ్, జలంధర్, తోట యాకయ్య, కావటి నరసయ్య, వెంకన్న గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
వెల్తూరి ముత్తయ్యకు నివాళులర్పించిన జాన్ వెస్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES