- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామ పంచాయతీలోని హనుమాన్ తండా నుండి 25 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మానాల మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అకర్షితులమై బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా యువకులు తెలిపారు.
- Advertisement -



