- Advertisement -
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే జరగనుంది. ఆరు అంశాల్లో ఈ సర్వే చేయాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ సర్వే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ కలిపి చేయాలని సూచించింది. సీడబ్ల్యూసీ సహకారం తీసుకోవాలని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివాదాస్పద అంశాలు సైతం ఉన్న నేపథ్యంలో అధ్యయనం అవసరమని చెప్పింది. తెలంగాణలోని నదీ ప్రవాహాలను లెక్కించాల్సి ఉంటుందని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సభ్య కార్యదర్శి మద్దల రఘురామ్ కేజీబీఓకు లేఖ రాశారు.
- Advertisement -