నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యజమాన్యాలకు ఇబ్బందిగా మారాయి. పాక్, భారత్ మధ్య యుద్ధ భయంతో ఐపీఎల్ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడంతో 2025, మే 17 నుంచి తిరిగి క్యాష్ రిచ్ లీగ్ కు పునః ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నెల (మే) 29 నుంచి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. దీంతో అతడు ఐపీఎల్ ఫ్లే ఆఫ్స్కు దూరం కానున్నాడు. కీలకమైన ప్లే ఆఫ్స్కు బట్లర్ దూరం కానుండటంతో అతడి ప్రత్యామ్నాయంపై గుజరాత్ టైటాన్స్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బట్లర్ స్థానాన్ని శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్తో భర్తీ చేసింది జీటీ. కుశాల్ మెండిస్తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు గురువారం (మే 15) అఫిషియల్గా అనౌన్స్ చేసింది.
గుజరాత్ స్టార్ బ్యాటర్ దూరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES