తొలి టీ20 విండీస్పై ఇంగ్లాండ్ గెలుపు
చెస్టర్ లె స్ట్రీట్ (ఇంగ్లాండ్) : జోశ్ బట్లర్ (96, 59 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) ఐపీఎల్ కొనసాగించాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో బట్లర్ 96 పరుగుల ధనాధన్ ఇనింగ్స్తో చెలరేగాడు. ఓపెనర్ జెమీ స్మిత్ (38, 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), జాకబ్ బెతెల్ (23 నాటౌట్, 23 బంతుల్లో 1 సిక్స్) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. బెన్ డకెట్ (1), హ్యరీ బ్రూక్ (6), టామ్ బాంటన్ (3) నిరాశపరిచారు. ఆఖర్లో బెతెల్ సైతం ఆశించిన వేగంతో పరుగులు చేయలేకపోయాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ (2/33), అండ్రీ రసెల్ (1/25), రోస్టన్ ఛేజ్ (1/19) మెరిశారు. 189 పరుగుల ఛేదనలో కరీబియన్లు 167 పరుగులకే పరిమితం అయ్యారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ లియాం డాసన్ (4/20) నాలుగు వికెట్ల మాయజాలంతో వెస్టిండీస్ను దెబ్బకొట్టాడు. జాకబ్ బెతెల్ (2/27) సైతం రెండు వికెట్లతో రాణించాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో ఎవిన్ లెవిస్ (39, 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), జాన్సన్ చార్లెస్ (18, 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రోమారియో షెఫర్డ్ (16), జేసన్ హోల్డర్ (16), రోస్టన్ చేజ్ (24) మెరిసినా ఆ జట్టు 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు వికెట్లతో మాయ చేసిన లియాం డాసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
జోశ్ బట్లర్ ధనాధన్
- Advertisement -
- Advertisement -